ఎవరిని పెళ్లి చేసుకోవాలి? బేతాళ ప్రశ్న 7?
విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి, చెట్టుపై ఉన్న శవాన్ని దించి ,భుజాన వేసుకుని , స్మశానము కేసి నడవసాగాడు. ఇంతలో శవం లో నుంచి బేతాళుడు బయటకు వచ్చి, రాజా నువ్వు నన్ను తీసుకు పోవడానికి ఎంతో కష్ట పడుతున్నారు.నీకు కష్టం తెలియకుండా నేను ఒక కథ చెబుతాను, కథ చివరలో ఒక ప్రశ్న అడుగుతాను.సమాధానం తెలిసి నువ్వు చెప్పకపోతే, నీ తల వెయ్యి వక్కలవుతుంది. గుర్తుంచుకో! కలింగదేశాన్ని నిరంకుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతడికి యుక్తవయస్సు వచ్చినప్పటి నుంచి ఈ ప్రపంచంలో అందరికంటే అందమైన యువతిని పెళ్లి చేసుకోవాలని కోరిక ఉండేది అతను అదే కోరికని తన జీవితాశయం గా పెట్టుకొని పెరిగి పెద్దవాడయ్యాడు. అనుకున్నట్టుగానే నిరంకుడికి పెళ్లి వయసు రాగానే తన తల్లిదండ్రులు యువరాణి కోసం వెతకసాగారు. ఇలా వెతుకుతున్నా తన తల్లిదండ్రులకు నిరంకుశుడు ఈ ప్రపంచంలో అందరికంటే అందమైన యువతని తీసుకువస్తేనే పెళ్లి చేసుకుంటాను అని చెప్తాడు. నిరంకుడి తల్లిదండ్రులు అందరికంటే అందమైన యువతిని తీసుకొచ్చిన వారికి ఒక గదినిండా బంగారు నాణాలు ఇస్తానని తన దేశంలో దండోరా వేయిస్తాడు అలాగే ఇతర దేశాలకు కూడా వర్తమానం పంపిస్తాడు. ఇలా దండోరా వేయించిన క